Header Banner

ఏపీ రాజ్యసభకు కూటమి అభ్యర్థి ఖరారు..! బీజేపీ నుంచి ఆయన ఎంట్రీ!

  Tue Apr 29, 2025 06:56        Politics

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్ధానానికి కూటమి అభ్యర్ధి ఖరారయ్యారు. ఈ స్ధానంలో కూటమి తరపున ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ పార్టీ ఇవాళ తమ అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ అయిన సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ప్రకటన చేసింది.
ఏపీ రాజ్యసభ అభ్యర్థి ఖరారు కోసం ఇవాళ సమావేశమైన పార్టీ ఎన్నికల కమిటీ పలు చర్చల తర్వాత రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది. రేపు మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో తర్జనభర్జనల తర్వాత పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయంచారు. బీజేపీ ఏపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి యూరప్‌ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలనే పాగాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పాక వెంకట సత్యనారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముందు నుంచి ఆర్ఎస్ఎస్ తో ఉన్న సంబంధాలు ఆయనకు కలిసి వచ్చాయని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాసవర్మ రూపంలో సాధారణ కార్యకర్తకు ఎంపీగా, కేంద్రమంత్రిగా అవకాశం కల్పించిన బీజేపీ.. ఇప్పుడు పాకా సత్యనారాయణ ఎంపికతో మరో మెసేజ్ పంపినట్లవుతోంది. మరో మూడున్నరేళ్లు ఆయన ఎంపీగా కొనసాగబోతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పాకా సత్యనారాయణ ఎంపీ కావడం లాంఛనమే.

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RajyaSabha #BJP #AndhraPradesh #PoliticalUpdates #AllianceCandidate #IndianPolitics #BJPinAP